BREAKING : ఏపీలో విషాదం.. 8వ తరగతి విద్యార్థికి గుండెపోటు

-

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో 8వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..ఏపీలోని పల్నాడు పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థికి గుండెపోటు వచ్చింది. దీంతో 8వ తరగతి విద్యార్థి కోటిస్వాములు మృతి చెందాడు.

రాత్రి భోజనం చేశాక ఊపిరాడటం లేదని ఫ్రెండ్స్‌కి చెప్పాడు విద్యార్థి కోటిస్వాములు. దీంతో ఆస్పత్రికి కోటిస్వాములును తరలించారు వార్డెన్‌. ఈ తరుణంలోనే.. కోటిస్వాములు మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. దీంతో కోటిస్వాములు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news