స్నాక్స్ విషయంలో అన్న‌ను కొట్టిచంపిన త‌మ్ముళ్లు …!

-

తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. తమ పిల్లలకు స్నాక్స్ ఇవ్వలేదన్న కారణంతో ఓ అన్నను తన సొంత తమ్ముళ్ళు కొట్టి చంపారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఛ‌టార్‌పూర్ జిల్లా ఇషాన‌గ‌ర్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తమ్ముళ్ల పిల్లలకు స్నాక్స్ ఇవ్వలేదన్న కోపంతో సొంత అన్నని తమ్ముళ్లు కొట్టి చంపేశారు. దీంతో మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు చూస్తే… సునీల్ అనే వ్యక్తి మార్కెట్ కు వెళ్లి పిల్లల కోసం స్నాక్స్ కొని తెచ్చాడు. అలా తెచ్చిన వాటిని భార్య చేతికి ఇచ్చి పిల్లలకు ఇవ్వమని చెప్పాడు.

murder
murder

అయితే ఆ స్నాక్స్ ను కేవలం తన పిల్లలకి మాత్రమే ఇచ్చింది. పక్కనే ఉన్న వారి మరిది పిల్లలను ఆమె పట్టించుకోలేదు. ఆ సమయంలో వాటి కోసం ఆ పిల్లలు మారాం చేయడంతో ఇద్దరు మరుదులు వదిన తో గొడవకు దిగారు. ఈ సంఘటనలో అన్న సునీల్ అడ్డుకునేందుకు రావడంతో గొడవ మరింతగా పెరిగి చివరికి తమ్ముళ్ల చేతిలో అన్న బాలి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ జరిగిన గొడవలో సునీల్ తమ్ముళ్లు అతని తలప పై ఓ పారతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news