చెట్టుకు వేలాడుతూ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు.. అత్యాచారం చేసి ఆపై హత్య..!

-

ఉత్తర్​ప్రదేశ్‌లోని లఖింపుర్​ ఖేరిలో దారుణం జరిగింది. ఇద్దరు దళిత మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. తన కూతుళ్లపై అత్యాచారం చేసి హత్య చేశారని మృతుల తల్లి ఆరోపించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

‘నిఘాసన్​ పోలీస్​ స్టేషన్​ పరిధికి చెందిన ఇద్దరు బాలికలను ఆరుగురు నిందితులు గ్రామ శివార్లలోని పొలానికి తీసుకెళ్లారు. అక్కడ ఆరుగురు కలిసి వారిద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం జరిగిన తర్వాత తమను పెళ్లిచేసుకోవాలని నిందితులను ఆ అక్కాచెల్లెళ్లు వేడుకున్నారు. దీంతో బాలికలను గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత వారి మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. నిందితులను చోటూ, జునైద్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరిఫ్‌లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నాం.’ అని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ.. యోగి ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version