సెల‌వుల్లో విషాదం.. కృష్ణా న‌దిలో ఐదుగురు విద్యార్థులు గ‌ల్లంతు

-

కృష్ణా జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని చంద‌ర్ల‌పాటు మండ‌లం ఏటూరు గ్రామానికి చెందిన ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఐదుగురు విద్యార్థులు కృష్ణా న‌దిలో గ‌ల్లంతు అయ్యారు. సంక్రాంతి సెల‌వులు కావ‌డంతో ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఐదుగురు పిల్లలు కృష్ణా న‌ది ఈత కొట్ట‌డానికి వెళ్లారు. దీంతో ఆ ఐదుగురు విద్యార్థులు గ‌ల్లంతు అయ్యారు. సాయంత్రం అయినా ఇంటికి రాక‌పోవ‌డంతో తల్లిదండ్రులు ఆందోళ‌న చెందారు.

Hand drowning man sticking out of the water

వారికి కోసం గాలించగ న‌ది ఓడ్డున వారి బ‌ట్ట‌లు క‌నిపించ‌డంతో న‌దిలో గ‌ల్లంతు అయ్యార‌ని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు, గ‌జ ఈత గాళ్లు విద్యార్థుల కోసం కృష్ణా న‌దిలో గాలిస్తున్నారు. కాగ కృష్ణా న‌దిలో గ‌ల్లంతు అయిన వారు ఐదుగురు కూడా ఏటూరు గ్రామానికి చెందిన వారే. అందులో క‌ర్ల బాల‌యేసు (12), మైల రాకేష్ (12), మాగులూరి స‌న్నీ (12), జెర్రిపోతుల చ‌ర‌ణ్, (13), జెట్టి అజ‌య్ (12) ఉన్నారు. కాగ వీరి ఆచూకీ కోసం కృష్ణా న‌దిలో గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version