తప్ప తాగి కారుతో బైకును ఢీకొట్టింది ఓ మహిళ. ఈ సంఘటనలో 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. రాజస్థాన్ – జైపూర్లో తప్ప తాగి కారుతో బైకును ఢీకొట్టింది మహిళ. ఈ సంఘటనలో 14 ఏళ్ల బాలిక మృతి చెందగా , ఇద్దరికి గాయాలు అయ్యాయి. మహిళ మద్యం తాగి కారు నడుపుతున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇక ఈ ప్రమాదం తర్వాత జరిగిన ఓ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో కారు నడుపుతున్న మహిళ పోలీసులతో చేతులు ముడుచుకుని మాట్లాడుతుండటం కనిపిస్తుంది. ఆ వీడియోలో పోలీసులు ఆ మహిళను ఈడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో భారీ ఎత్తున జనసమూహం కూడా కనిపిస్తోంది. పోలీస్ వ్యాన్లో మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు కూడా కనిపిస్తుంది. కారు నడుపుతున్న మహిళ నాగ్పూర్ నివాసి అయిన సంస్కృతిగా గుర్తించారు.