స్కూల్​ను మద్యం గోదాముగా మార్చిన లిక్కర్ మాఫియా

-

బిహార్ లో లిక్కర్ మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏకంగా ఓ పాఠశాలనే మద్యం గోదాముగా మార్చేసింది లిక్కర్ మాఫియా. విదేశీ మద్యం సీసాలను నిల్వ ఉంచేందుకు వైశాలి జిల్లా లాల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బృందావన్‌ గ్రామ హైస్కూలును తమ అడ్డాగా మార్చుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పాఠశాల ఉపాధ్యాయుడు ఆదేశ్ పాల్ బుధవారం ఉదయం స్కూల్ కి వెళ్లారు. ఓ గదికి తాళం వేసి ఉండటం గమనించి ప్రిన్సిపల్ కు చెప్పారు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. లాల్‌గంజ్‌ పోలీసులు తాళం పగలగొట్టారు. తలుపులు తెరిచి చూడగా గదిలో మద్యం సీసాలు నిల్వ చేసి ఉన్నాయి. దాదాపు 140 పెట్టెల విదేశీ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.  కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version