చిక్కుల్లో భూమా అఖిలప్రియ భర్త, సోదరుడు.. బోయిన్‌పల్లి పీఎస్‌లో మరో కేసు

-

హైదరాబాద్: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త, సోదరుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పటికే వ్యక్తి కిడ్పాప్ కేసులో వీళ్లు నిందితులుగా ఉన్నారు. కోర్టుకు హాజరుకాకుండా నకిలీ కోవిడ్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వీరిపై పోలీస్ కేసు నమోదు అయింది.

భార్గవ్, జగత్ విఖ్యాత్ రెడ్డి ఈ నెల 3న కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ నెల 1న నకిలీ కొవిడ్ సర్టిఫికెట్ సమర్పించినట్లు వీరిద్దరిపై అభియోగం ఉంది. కరోనా కారణంగా కోర్టుకు హాజరుకాలేమని భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి కోర్టుకు నకిలీ పత్రాన్ని సమర్పించారు. ఈ సర్టిఫికెట్‌ను బోయిన్ పల్లి పోలీసులు పరిశీలించారు. కొవిడ్ సర్టిఫికెట్ ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపట్టారు. నకిలీ సర్టిఫికెట్ జారీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ముగ్గురు ఆస్పత్రి సిబ్బందిపైనా కేసు నమోదు చేశారు. వినయ్, రత్నాకర్, శ్రీదేవిపై కేసులు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version