హైదరాబాద్ లో దారుణం.. ప్రియుడి కోసం భర్తను దారుణంగా !

-

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో ఈనెల 11వ తేదీన జరిగిన పండ్ల వ్యాపారి హత్య కేసును శంకర్పల్లి పోలీసులు చేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని భార్య… భర్తను ప్రియుడితో చంపించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మద్దూరు కు చెందిన శంకరయ్య, జయసుధ ఇద్దరు దంపతులు. 14 సంవత్సరం కింద పటాన్చెరువు సమీపంలోని బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకున్నారు.

crime

ఈ నేపథ్యంలోనే భార్య జయసుధకు జిమ్ ట్రైనర్ తిరుపతిరావు తో రెండు నెలల కింద అక్రమ సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ… భర్తకు తెలియకుండా ప్రతిరోజు శృంగారంలో పాల్గొనేవారు. అయితే ఈ విషయం శంకరయ్యకు తెలియడంతో భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం శంకరయ్య హత్యకు కుట్రపడ్డారు వీరిద్దరు. ఈ నేపథ్యంలోనే ఇటీవల శంకరయ్య తలపై కొట్టి హతమార్చారు. అయితే ఈ కేసును తాజాగా పోలీసులు చేదించి… అసలు విషయాన్ని బయటపెట్టా రు. అనంతరం నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version