తొమ్మిదో తరగతి విద్యార్థిని గొంతు కోసిన టీచర్!

-

అతడు టీచర్. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సినోడు. కానీ.. ప్రేమ పాఠాలు నేర్పించబోయాడు. చివరకు దుర్మార్గుడిలా ప్రవర్తించాడు. విద్యార్థిని గొంతు కోశాడు. ఈ దారుణం కర్నూలు జిల్లా బంగారుపేటలో చోటు చేసుకున్నది. శంకర్ నాయక్ అనే యువకుడు బంగారుపేటలోని ఓ స్కూల్ లో హిందీ పండిట్ గా పని చేస్తున్నాడు. అదే స్కూల్ లో ఓ విద్యార్థిని 9 వ తరగతి చదువుతోంది.

ఆ విద్యార్థిని ఇంటి దగ్గర్లోనే ఈ టీచర్ కూడా అద్దెకు ఉంటున్నాడు. దీంతో ఆ విద్యార్థిని ప్రేమించమంటూ వేధించేవాడు. వెంటపడేవాడు. ప్రేమ లేదు.. దోమ లేదు.. అంటూ ఆ విద్యార్థిని ఒప్పుకోకపోవడంతో ఉన్మాదిలా మారాడు. శనివారం ఉదయం అమ్మాయి తల్లిదండ్రులు పనికి వెళ్లినప్పుడు ఇంట్లోకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో విద్యార్థిని గొంతు కోశాడు. విద్యార్థిని అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకొని అతడిని పట్టుకోబోయారు. దీంతో అతడు కూడా గొంతుకోసుకోబోయాడు. ఇంతలోనే వాళ్లు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. విద్యార్థినిని, అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version