జంట ఆత్మహత్య.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు

-

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనంతగిరి కొండల్లో ఓ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇద్దరు చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. వారి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కనిపించాయి. కేవలం ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి.

 

అయితే వారు ఆత్మహత్య చేసుకుని చాలా రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలానికి సమీపంలో ఉన్న బైక్, సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. మృతులను జిల్లాలోని కోట్‌పల్లి మండలానికి చెందిన శివలీల, మహేందర్‌లుగా గుర్తించారు.

అయితే వారు ఆత్మహత్య చేసుకున్నారా లేదా.. ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. అలాగే ఘటన స్థలంలో లభించిన ఫోన్ కాల్ డేటాను పరిశీలించే పనిలో పడ్డారు. అయితే ఘటన స్థలంలో ఏ విధమైన సూసైడ్ నోట్ లభించనట్టుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం శివలీల కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news