బంగారానికి బిల్లు అడిగితే దవడ పేలిపోయింది…!

-

విదేశాల నుంచి భారత్ లోకి అక్రమంగా బంగారం రవాణా జరుగుతుంది. అధికారులు ఏ స్థాయిలో తనిఖీలు చేసినా సరే జనం మాత్రం సరికొత్తగా ఆలోచిస్తూ బంగారాన్ని భారత్ లోకి తీసుకొస్తున్నారు. విహారయాత్రల పేరిట విదేశాలకు వెళ్ళిన బంగారం స్మగ్లర్లు, విదేశాల్లో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి భారత్ లోకి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళిన సమయంలో భారతీయులు భారీగా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడంతో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందుకోసం ఆధునిక టెక్నాలజీని తీసుకొచ్చినా సరే ఫలితం లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు స్మగ్లర్లు సరికొత్తగా ఆలోచిస్తూ పొట్టలో, తలలో, చెప్పుల్లో, బూట్లలో ఇలా అన్ని రకాలుగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. ముఖ్యమగా హైదరాబాద్, ముంబై, బెంగలూరు, అహ్మదాబాద్ వంటి కీలక నగరాల్లో ఇదే ఎక్కువగా జరుగుతుంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఇలా బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కొందరు మహిళలు బిల్లు అడిగితే అధికారుల మీద దాడి చేసారు. దుబాయ్ నుంచి స్పైస్‌జెట్ ఫ్లైట్‌లో అహ్మదాబాద్‌కు వచ్చిన కొందరు భార్యాభర్తలను తనిఖీ చేయగా వారి వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉంది. వాటికి సంబంధించిన బిల్లులు చూపించాలని మహిళలను అడగగా వారు ఏకంగా కస్టమ్స్ అధికారి గూబగుయ్యిమనిపించారు. ఇక ఆ వెంటనే భర్తలతో కలిసి విమానాశ్రయంలో కుర్చీలు ఫర్నీచర్ నాశనం చేస్తూ గలాటాకు దిగారు. ఇక అక్కడికి మీడియా వెళ్లి చూడగా అధికారులు స్పందిస్తూ తాము బంగారానికి రశీదులు అడిగితే తమ మీద దాడికి దిగారని వాపోయారు. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసి స్టేషన్ కి తరలించారు పోలీసులు. వారికి ఒక నాయకుడి అండ ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news