పోలీసులకు కూడా అర్ధం కాని ప్రముఖుడి భార్య సూసైడ్ లెటర్…!

-

అట్లాస్ సైకిల్స్ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్ మంగళవారం ఢిల్లీలోని లుథియానా రోడ్ లోని ఔరంగజేబ్ లేన్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె తన సూసైడ్ లెటర్ లో ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు ఇది పోలీసులకు కూడా మిస్టరీగా మారిపోయింది. తన ఆత్మహత్య లేఖలో, నటాషా కపూర్ “చేయకూడనిది” చేశానని అందుకు సిగ్గుపడి ఆత్మహత్య చేసుకున్నట్టు ఉంది.

నటాషా కపూర్ తన సూసైడ్ నోట్‌లో తన కుటుంబ సభ్యులను తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె రాయడం ఆశ్చర్యంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పలేదు. 57 ఏళ్ల ఆమె తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి నిర్ణయానికి మరెవరూ బాధ్యులు కాదని పేర్కొన్నారు. “నేను నా జీవితాన్ని నేనే ముగిస్తున్నాను. దానికి ఏ వ్యక్తి బాధ్యత వహించడు.

చేయకూడని పనిని నేను చేసాను. నా దృష్టిలో నేను చాలా సిగ్గుపడుతున్నాను. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను, సంజయ్, నా కుమార్తె మరియు నా కొడుకు, నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను “అని సూసైడ్ నోట్ లో ఆమె పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆత్మహత్య గురించి తమకు సమాచారం అందిందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

అయితే ఆమెకు కుటుంబ సభ్యులతో ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భోజనం చేసే సమయంలో తన కుమారుడు పిలిచినా ఆమె గదిలో నుంచి బయటకు రాలేదని లోపలే ఉన్నారని తలుపు తీసి చూడగా ఆత్మహత్య చేసుకుని ఉన్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమె మొబైల్ ని పరిశీలించినా ఎటు వంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news