ఏపీ ప్రభుత్వం దివాలా దిశగా పయణిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం – పురందేశ్వరి

-

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి. విభజన హామీలు అన్నింటినీ కేంద్రం నెరవేరుస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం హామీ ఇచ్చినట్లుగానే రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం చేస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అన్ని శాఖలలోనూ పెద్ద ఎత్తున అవినీతి పేరుకుపోయిందని ఆరోపించారు పురందేశ్వరి. వైసిపి ప్రభుత్వం మద్యం విక్రయాలపై ఎందుకు డిజిటల్ పేమెంట్స్ ని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏలూరులో కార్పొరేషన్ స్మశానాలలో అంత్యక్రియలకు 5000 చొప్పున వసూలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాలా దిశగా పయనిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అన్నారు పురందేశ్వరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version