‘పేద పిల్లల కడుపులు నింపుతుంటే మీ కడుపులు ఎందుకు మండుతున్నాయి’

-

టీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి కాంగ్రెస్‌ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు దాసోజు శ్రవణ్‌. సీఎం కేసీఆర్‌ కన్న తండ్రి లాగా పేద పిల్లల కడుపులు నింపుతుంటే మీ కడుపులు ఎందుకు మండుతున్నాయి. అడ్డగోలు సంపాదనకు, దోపిడీకి అలవాటు పడి కోట్లకు పడగలెత్తిన రేవంత్ రెడ్డికి, పేదింటి పిల్లల కడుపుమంట బాధ తెలియదు. పొద్దున్నే స్కూల్ లలో పసి పిల్లల కళ్లల్లో ఆనందం తొణికిసలాడుతుంటే మీ కళ్లలో ఎందుకు నిప్పులు పోసుకుంటున్నారు.

50 ఏళ్ల మీ పాలనలో పిల్లల తల్లిదండ్రులకు ఇబ్బందులు కాకుండా పొద్దున్నే పిల్లలకు పౌష్టికాహారం తినిపించాలన్న సోయిలేని మీరు.. ఇవాళ ఇవన్నీ అమలు చేస్తున్న కేసీఆర్ పై దాడి చేయడం మీ మానసిక దౌర్భల్యానికి నిదర్శనం. 23 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పసి పిల్లలకు కేసీఆర్ ఒక తాత లాగా కడుపునిండా కమ్మని ఫలహారం (బ్రేక్ ఫాస్ట్ ) పెట్టి కన్నతండ్రి లాగా ఆ పిల్లలకు అండగా ఉంటుంటే మీ కడుపులు ఎందుకు మలమల కాలుతున్నాయి.

ఒకప్పుడు ప్రభుత్వ బడి అంటే పనికిరాని బడి అన్నట్టు అభిప్రాయం ఉండేది. కానీ నేడు అద్భుతమైన సౌకర్యాలతో ప్రభుత్వ స్కూల్ లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టె పరిస్థితీ వచ్చింది. అద్భుతమైన భవనాలు, కమ్మటి ఫలహారం.. మంచి మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఉచితంగా నాణ్యమైన యూనిఫామ్ బట్టలు .. ఒక చక్కటి వాతావరణం  లో విద్యానందిస్తున్న విద్యాదాత కేసీఆర్. ఇంత నీచానికి దిగజారిపోయి, పిల్లల కడుపులు కొట్టే రేవంత్ రెడ్డి మాటలు బడుగు, బలహీన, దళిత, గిరిజన,పేద వర్గాల జనం నమ్మరు..’ అని దాసోజు శ్రవణ్‌ లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version