తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ : అద్దంకి దయాకర్

-

డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం తీరని లోటు అని కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ అన్నారు. ప్రపంచ ఆర్థిక రాజనీతిజ్ఞుడు భారత దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లో కాపాడిన నేత అని.. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ అని ఆయన సేవలను కొనియాడారు.మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రగడ సానుభూతిని తెలియజేశారు.

ఇదిలాఉండగా మన్మోహన్ సింగ్ మరణంపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, వ్యాపారవర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. మన్మోహన్ సింగ్ మరణంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version