హైదరాబాద్ లో దారుణం.. లవర్ తో కలిసి తల్లిని హత్య చేసిన బాలిక..!

-

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి మైనర్ బాలిక తల్లిని దారుణంగా హతమార్చింది. ఈ ఘటన హైదరాబాదులోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం…. చింతల్ మెట్ లో నివసించే దంపతులకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. వారిలో పెద్ద కుమార్తె వివాహం కాగా చిన్న కుమార్తె (17) అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు (17) తో ప్రేమలో పడింది. అయితే బాలిక ప్రేమ విషయం కాస్త ఇంట్లో తెలిసింది. దాంతో తల్లిదండ్రులు మందలించారు. పిచ్చిపిచ్చి వేషాలు మానుకోవాలని బాలికకు చెప్పారు.crime

ఈ క్రమంలో బాలికకు తల్లిదండ్రులకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం కూడా బాలిక తల్లితో ఇదే విషయం పై గొడవ జరిగింది. ఆ సమయంలో తండ్రి బయటకు వెళ్లడంతో బాలిక తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. అనంతరం బాలిక ప్రియుడితో కలిసి కన్న తల్లి మెడకు చున్నీ బిగించి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాలికను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news