కేసీఆర్ ని కూడా లైట్ తీసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు, అసలు స్టోరీ ఏంటీ…?

-

ఇటీవల కరోనా బారి నుంచి కోలుకుని బయటపడ్డారు తెలంగాణా డిప్యూటి స్పీకర్ పద్మారావు. ఆయన ఆరోగ్యం ఏ ఇబ్బందులు లేకుండా సక్రమంగానే లైన్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత క్షేమంగా బయటపడిన పద్మారావు, అక్కడి నుంచి కూడా వినూత్న మార్గంలో తల నొప్పి తెప్పిస్తున్నారు. అసలు మేటర్ ఏంటో చూడండి. మాస్క్ ధరించాలి అని సిఎం కేసీఆర్, మంత్రి కేటిఅర్ పదే పదే చెప్తున్నారు.

అయినా సరే పద్మారావు లైట్ తీసుకుంటున్నారు. రెండు మూడు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అసలు వారి మాటను లెక్క చేయకుండా మాస్క్ లేకుండానే తిరుగుతున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. కెసిఆర్ కేటీఆర్ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న పద్మారావు అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఎంత మొత్తుకున్నా వందలకొద్ది జనాల్ని పోగుచేసి ఫోటోలు దిగుతున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు అని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఈ కార్యక్రమంలో సీతాఫల్మండి కార్పొరేటర్ హేమ సామల , పద్మారావు తనయుడు రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version