బ్రేకింగ్ : దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్కరోజులోనే..?

-

దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది. భారీ సంఖ్యలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రోజురోజుకు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ప్రతి రోజూ కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 40 వేల 425 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 11,18,043 కి చేరింది.

corona test

ఇక ఇందులో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3, 90, 459 ఉండగా.. 7 లక్షల 87 మంది కరోనా నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 681 మరణాలు సంభవించాయి. మొత్తగా దేశం లో 27,497 మంది కరోనా తో మృతి చెందారు. ప్రస్తుతం రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. తీవ్ర భయాందోళన లో ఉన్న దేశ ప్రజానీకం మొత్తం కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కేసులు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version