వైసీపీ ఆవిర్భావ వేళ ధ‌ర్మాన ఏమ‌న్నారంటే..?

-

శ్రీ‌కాకుళం న‌గ‌రం : వైసీపీ ఆవిర్భావం సంద‌ర్భంగా ఇవాళ త‌న త‌ర‌ఫున ఆనందం పంచుకుంటూ సోష‌ల్ మీడియాలో శ్రీ‌కాకుళం శాస‌న స‌భ్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కార్య‌వ‌ర్గానికి శుభాకాంక్ష‌లు తెలిపారు.ప్రముఖ సామాజిక మాధ్య‌మం ట్విట‌ర్ ద్వారా త‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చేందుకు ప్ర‌జ‌ల మ‌ధ్య ప్ర‌జ‌ల కోసం పుట్టిన పార్టీ వైసీపీ అంటూ త‌న ఆనందాన్ని పంచుకున్నారు.

శ్రేణులు, కార్య‌క‌ర్త‌లకు, పార్టీ ఉన్న‌తికి నిరంత‌రం శ్ర‌మిస్తున్న డిజిట‌ల్ మీడియా విభాగ ప్ర‌తినిధులకు త‌న త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.పార్టీ చెప్పిన ప్ర‌తి మంచి ప‌నినీ శిర‌సా వ‌హిస్తూ,బాధ్య‌త‌గా న‌డుచుకుంటున్న త‌న కార్య‌క‌ర్త‌లంద‌రినీ మ‌రోమారు అభినందించారు.యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిశానిర్దేశ‌క‌త్వంలో స‌మ‌ష్టి కృషితో మ‌రింత శ్ర‌ద్ధ వ‌హించి ప‌నిచేసి రాష్ట్రాభివృద్ధికి బాట‌లు వేయాల‌ని త‌న కార్య‌వ‌ర్గానికి పిలుపునిచ్చారు.త‌న త‌ర‌ఫున జిల్లా ప్ర‌గ‌తికి ఎన్న‌డూ కృషి చేస్తూనే ఉంటాన‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version