ధర్మపురి అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్.. తాళం చెవులు మిస్సింగ్

-

ధర్మపురి అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్ వివాదం పై.. పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు డైరెక్షన్ ప్రకారం కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తున్నాం అని పిలిచారు..పొద్దున్న10 నుండి ఇప్పటి వరకు తాళాలు దొరకడం లేదన్నారు. తాళం చెవికి కలెక్టర్ కస్టోడీయన్ గా ఉంటారు…తాళం చెవులు ఎలా మిస్ అవుతాయి…? అని సీరియస్ అయ్యారు.

మూడు గంటలుగా తాళం చెవిల కోసం వెదుకుతూనే ఉన్నారు…స్ట్రాంగ్ రూమ్ తాళం చెవిల మిస్సింగ్ పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 4వ తేదీన కోర్టు ఆదేశాలు ఇస్తే… 6 రోజుల నుంచి తాళం చెవులు దొరకలేదా..? అని ప్రశ్నించారు. అత్యంత భద్రం అని భావించే స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు మిస్ అవ్వడం నిర్లక్ష్యం అని… తాళం పగల గోట్టే ప్రయత్నం అధికారులు చేస్తే మేము అడ్డుకున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version