నవంబర్ 29న వరంగల్ లో దీక్ష దివస్ – టీఆర్‌ఎస్‌

-

నవంబర్ 29న ఉద్యమాల గడ్డ వరంగల్ లో దీక్ష దివస్ ను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్. బిజెపి చీఫ్ బండి సంజయ్ పై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ది అహంకార యాత్ర అని.. పాదయాత్రతో సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్.

బిజెపి, బండి సంజయ్ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బిజెపిది పాద యాత్ర కాదు కుట్రల యాత్ర అని ఆగ్రహించారు. ప్రజా ప్రభుత్వాలను కూల్చాలనుకుంటే ప్రజలు సహించబోరని.. కేంద్రం, బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని నిప్పులు చెరిగారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్. ఈడీ, ఐటీ దాడులతో కేసీఆర్ కుటుంబం సహా, మంత్రులను బిజెపి వేధిస్తోందని.. బీజేపీ నాయకుల కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ ఆవిర్భావం జరిగిందన్నా రు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version