విషాదం : కరోనాతో లెజండరీ హీరో సోదరుడు మృతి..!

-

కరోనా మహమ్మారి దేశాన్ని ప్రస్తుతం వణికిస్తోంది. రోజురోజుకి వేలల్లో కేసులు, వందల్లో కరోనా మరణాలు నమోదవుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజలు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందర్నీ బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి. తాజాగా.. ప్రముఖ బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ కుమార్ సోదరుడు అస్లామ్ ఖాన్ కరోనా తో కన్నుమూసారు. దిలీప్ కుమార్ ఇద్దరు సోదరులు అస్లామ్, ఎషాన్ ఖాన్ లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో గత శనివారం లీలావతి హాస్పటల్‌లో చేర్చారు. వీళ్లిద్దరికి పరీక్షలు నిర్వహించగా.. పరీక్షల్లో కరోనా పాజిటిల్ అని నిర్ధారణ అయింది.

దీంతో వెంటనే వారిని కరోనా వార్డుకు మార్చి చికిత్స అందించడం మొదలుపెట్టారు. పైగా అస్లామ్ ఖాన్ అప్పటికే డయాబెటీస్, హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారు. దీంతో వైద్యులు అస్లామ్‌కు అత్యవసర చికిత్స అందించిన ఆయన అవయవాలు స్పందించక పోవడంతో అస్లామ్ ఖాన్ ఈ ఉదయం మరణించారు. ఈ విషయాన్ని లీలావతి హాస్పిటల్ డాక్టర్ జలీల్ పార్కర్  మీడియాకు తెలియజేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version