కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే ఇలా చేయాల్సిందే..?

-

ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో అభివృద్ధి బాటలో పయనించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా సుఖసంతోషాలు పొందడమే కాకుండా ఎన్నో సమస్యలను కూడా దూరం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇకపోతే కొంత మంది ఇళ్లల్లో ప్రతికూల శక్తి ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇటువంటి పరిస్థితులలో ఇంట్లో దోషాలు ఉండవచ్చు. ఇలాంటి లోపాల కారణంగా మానసిక, శారీరక, ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇక ప్రజలు కూడా తరచూ తమ ఇంటికి సంబంధించిన తప్పులు కూడా చేస్తూ ఉంటారు. వీటి కారణంగా ఆర్థిక ప్రభావం మీ పై పడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి ని ఇబ్బంది పెట్టే వాస్తు తప్పుల గురించి కూడా మీరు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఇక మీరు నిత్యం మీ ఇంట్లో వుండే కులాయి నుండి నీరు కారుతూ ఉంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక సంక్షోభాన్ని కలిగిస్తుంది. నీరు వృధాగా ఖర్చు చేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉండదట. కనుక మీ ఇంట్లో అలాంటి సమస్యలు ఉన్నట్లయితే వెంటనే పరిష్కారం చూపే ప్రయత్నం చేయండి. ఇక నిరంతరం ఇంట్లో తడిగా ఉండడం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ లభించదు. కాబట్టి నీరు ఎలా బయటకు వెళుతుందో డబ్బు కూడా అలా ఇంటి నుంచి వెళ్తూ నష్టం వాటిల్లుతుందని పెద్దలు చెబుతున్నారు .కాబట్టి ఇంటిని తడిగా ఉండకుండా చూసుకోవాలి.

ఇక కొంతమంది ఇళ్ళల్లో పావురం గూడు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇది వాస్తు దోషం అని చెబుతారు. చాలాసార్లు ప్రజలు తమ ఇళ్లలోని పావురం గూడు ఏర్పాటు చేసుకుంటున్నా పట్టించుకోరు. ఇలా చేయడం వల్ల పావురానికి మేలు జరిగినా.. ఆ కుటుంబ సభ్యులకు దరిద్రం తాండవాడుతుంది. కనుక ఇంట్లో పావురం గూడు కనిపిస్తే వెంటనే తొలగించండి. ఇలాంటి చిన్నచిన్న పరిహారాలను పాటిస్తే ఆర్థిక సంక్షోభం నుండి బయట పడతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version