ప్రేమకథచిత్రం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

-

తెలుగు ఇండస్ట్రీ లోకి సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుదీర్ బాబు నటించిన ప్రేమ కథ చిత్రంతో హీరోయిన్గా మంచి పేరు సంపాదించింది నందితా రాజ్. ఇక తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుందిఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఇక తన కళ్ళతో అందంతో అందరిని బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో తన నటనకు గుర్తింపు సంపాదించుకున్న నందిత సోషల్ మీడియాలో కూడా బాగ యాక్టివ్ గా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటూ సిని కెరియర్ కి కూడా దూరంగా ఉన్నది ఈ ముద్దుగుమ్మ.

మొదట మోడలింగ్ వైపు నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు వచ్చిన నిలదొక్కుకోలేకపోయింది. మొదట నీకు నాకు డాష్ డాష్ అనే చిత్రం ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది.ఆ తర్వాత ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో నటనపరంగా ఈమెకు మాత్రం మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. ఇక ప్రేమ కథ చిత్రంతో యంగ్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. ఇక తర్వాత నటించిన సావిత్రి, లవర్స్, రామ్ లీలా, శంకరాభరణం తదితర చిత్రాలలో నటించింది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి మళ్లీ ఈమె మోడలింగ్ వైపు అడుగులు వేసినట్లుగా తెలుస్తోంది ముద్దుగుమ్మ.

ప్రస్తుతం నందిత ముంబైలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె తమిళంలో కూడా కొన్ని సినిమాలలో నటించింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈమె వద్దకు కొన్ని కథలు వెల్లగా కథలు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం.అయితే ఈ అభిమానులు మాత్రం ఈమె కోసం సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. దీంతో నైనా ఈ ముద్దుగుమ్మ అభిమానుల కోరిక మేరకు తిరిగి సినిమాలలో రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news