డీఎస్సీ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు

-

డీఎస్సీ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. డీఎస్సీకి ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు డీఎస్సీ ద‌ర‌ఖాస్తుల గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. వాస్త‌వానికి నోటిఫికేష‌న్‌లో ఇచ్చిన ప్ర‌కారం ఈ నెల 21తో గ‌డువు ముగుస్తుంది. రేప‌టి వ‌ర‌కు డ‌బ్బులు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించ‌గా, 21తో ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు అవ‌కాశం ఇచ్చారు. కానీ ఈ గ‌డువును 28 వ‌ర‌కు పొడిగించారు. రాష్ట్రంలో 5089 టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి కొద్ది రోజుల క్రితం నోటిఫికేష‌న్ వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే.

కాగా.. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్​ 20 నుంచి పది రోజుల పాటు సీబీఆర్​టీ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. ఎన్నికల కారణంగా ఈ పరీక్షల తేదీలను వాయిదా వేశారు. మరోవైపు బీఈ, బీటెక్‌తో బీఈడీ ఉన్న అభ్యర్థులు కూడా టీచర్​ పోస్టులకు అర్హులేనని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పరీక్షలు వాయిదా పడ్డందున.. అప్లికేషన్ల గడువును పొడిగించాలని అభ్యర్థులు విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అప్లికేషన్ల గడువును మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version