తెలంగాణా మంత్రికి షాక్ ఇచ్చిన పోలీసులు, కేసు నమోదు

-

తెలంగాణా కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి పై 447,506 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేసారు దుందిగల్ పోలీసులు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం భవాని నగర్ సురారం కాలనీ కి చెందిన శ్యామల దేవి కి చెందిన భూమిని కలుపు కొని తన భూమిని అమ్ముమని బెదిరిస్తున్నారు అని, ఆమె తల్లి భూమి అమ్మడానికి నిరకరించారని తన అనుచరులతో అక్రమంగా భూమి కబ్జా చేయించి ఆమె భూమి లో కాంపౌండ్ వాల్ ప్రహరీ గోడ నిర్మించారని తన భూమిని మల్లారెడ్డి చెరలో నుంచి తీసుకోవాలని న్యాయవాదిని సంప్రదించారు.

ఆ న్యాయవాది మల్లారెడ్డి తో కుమ్మక్కు అయి తాను సంతకం చేసిన పత్రాలను మల్లారెడ్డి కి అందచేసాడాని ఆ స్టాంప్ పేపర్ పై మల్లారెడ్డి తప్పుడు ఒప్పందాన్ని సుష్టించడాని దుందిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. దీనితో ఆ కేసును దుందిగల్ పోలీసులు నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version