శిథిలాల కింద మూడు రోజులు చిక్కుకున్న ఆ ఇద్దరు చిన్నారులు…!

-

ఓ ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక.. మరో చోట 3 ఏళ్ల చిన్నారి.. ఎటు చూసినా చీకటే. ఊపిరి కూడా సరిగా అందని స్థితి. కదిలేందుకు కూడా వీలులేనంతగా శిథిలాల కింద చిక్కుబడిపోయారు. ఇలా.. గంటలు కాదు.. రోజులు గడిపారు. టర్కి, గ్రీస్‌ భూకంపంతో కూలిన అపార్ట్‌మెంట్ల శిథిలాల కింద ఆ ఇద్దరూ మూడు రోజుల పాటు ప్రాణాలతో గడిపారు. సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్‌ గమనించి రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.

కాగా.. టర్కీలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ బృందాలు 106 మందిని శిథిలాల కింద నుంచి ప్రాణాలతో వెలికి తీశాయి. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృత దేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 81 మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version