ముగిసిన ఎన్నికల కోడ్.. రాష్ట్ర ప్రజలకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్

-

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగిసింది.ఈ నేపథ్యంలో గృహ జ్యోతి పథకానికి అప్లై చేసుకున్న వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. అర్హులైన వారికి నేటి నుంచి గృహజ్యోతి స్కీమ్ కింద సున్నాబిల్లులు జారీకి నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. కోడ్ ముగియడంతో తిరిగి ప్రతి ఒక్కరికి సంక్షేమం అంటూ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.

200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు సున్నా బిల్లులను ప్రభుత్వం జారీ చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం అర్హులైన అందరికీ సంక్షేమం అందించనుందని తెలిపారు. కాగా ఇంటి అవసరాల నిమిత్తం 200 యూనిట్లకంటే తక్కువ కరెంటు వాడుకునే వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ను రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి 27న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, సార్వత్రిక ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ పథకం అమలు కాలేదు. ఇక నేటితో కోడ్ ముగియడంతో నేటి నుంచి సున్నా బిల్లులు జారీ చేస్తామని మంత్రి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version