బీజేపీ ఎంపీలు దద్దమ్మలు.. విరుచుకుపడ్డ ఎర్రబెల్లి

-

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల సమావేశంలో  పాల్గొన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ పై విరుచుకు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద వివక్ష చూపెడుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కేంద్రాన్నికోరితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెలంగాణకు ఇవ్వలేదని, అదే పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ కు 7 కాలేజ్ లను మంజూరు చేసిందని విమర్శించారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.

కేంద్రం నుంచి తమ పార్లమెంటు నియోజకవర్గానికి ఏ ఒక్క మెడికల్ కాలేజీ నీ తీసుకురా లేని దద్దమ్మలు అని ఆయన అన్నారు. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక బ్లాక్ మెయిలర్, రేప్ కేసులో నిందితుడిగా ఉన్న రఘునందన్ కు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బీజేపీ మేనిఫెస్టో లో పెట్టే విధంగా రెండు కోట్ల ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చారా అని ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో బీజేపీ పార్టీ భ్రష్టుపట్టి పోయిందని , నైతిక విలువలు  కూడా పాటించలేని పార్టీగా మిగిలి పోయిందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version