కేసీఆర్‌ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు : ఈటల రాజేందర్

-

కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను పిరికిపంద అంటూ ఫైర్‌ అయ్యారు హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ ను గద్దె దించటానికి విద్యార్థులు, యువత, నిరుద్యోగులు కలసిరావాలని.. ఒక్కసారి కుప్పకూలితే టీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చే ఆసార్కం లేదని చెప్పారు. బియ్యం కొనమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని.. నిరుద్యోగుల కలలను కేసీఆర్ ప్రభుత్వం కల్లలుగా మిగిల్చిందని మండిపడ్డారు.

పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా కాకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని.. గతంలో మాదిరి కేసీఆర్ కోసం త్యాగాలు చేసేవారు తెలంగాణ గడ్డ మీద లేరని తెలిపారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు తొలగించకుంటే భవిష్యత్తులో కేసీఆర్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని.. తెలంగాణ గడ్డపై ఎగరబోయేది కాషాయజెండా మాత్రమేనని స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఫీల్డ్ అసిస్టెంట్ల నోట్లో మట్టికొట్టిన దుర్మార్గపు పార్టీ టీఆర్ఎస్ అని.. ఏడాదిలో‌ 145రోజులు ఫాంహౌస్ లో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు మగ్గిపోతున్నారని.. సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ అండగా ఉంటోందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version