చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు మునుగోడులో తృటిలో టీఆర్ఎస్ గెలిచింది : ఈటల

-

మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ ప్రజల కళ్లలో మట్టికొట్టి రాచరిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్. ఈ పాలనను అంతం చేయడానికి యావత్ తెలంగాణ ప్రజలు కులం, మతంతో సంబంధం లేకుండా ఏకమవుతున్నారని పేర్కొన్నారు ఈటల రాజేందర్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మదనపల్లి, ముచ్చింతల్, పిల్లోని గుడా,పెద్ద తుప్ర గ్రామాలలో ఏర్పాటుచేసిన భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

ఈసందర్భంగా మదనపల్లి మాజీ సర్పంచ్ తో పాటు షాపూర్ తండా, ముచ్చింతల్, పిల్లోనిగుడ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ లో చేరారు ఈటల రాజేందర్. చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు మునుగోడులో తృటిలో టీఆర్ఎస్ గెలిచిందని ఈటల కామెంట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మునుగోడులో బీజేపీ కార్యకర్తల కృషిని కొనియాడారని గుర్తు చేశారు ఈటల రాజేందర్. రాబోయే కాలంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా బీజేపీయే గెలుస్తుందన్నారు ఈటల రాజేందర్. పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version