‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌…

-

”మీలో ఎవరు కోటీశ్వరులు” షో అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు బాగా ఇష్ట పడతారు. అయితే…. ”మీలో ఎవరు కోటీశ్వరులు” షో అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షోకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా రానున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ రియాలిటీ సో కరోనా మహమ్మారి కారణంగా చాలా ఆలస్యం అయింది. కరోనా మహమ్మారి లేకపోతే… ఈ పాటికీ టీవీల్లో ఈ షో టెలికాస్ట్‌ అయ్యేది.

ఇక ఇటీవలే ఈ షోకు సంబంధించిన ఓ అదిరిపోయే ప్రోమో వీడియోను రిలీజ్‌ చేసింది జెమినీ టీవీ యాజమాన్యం. అయితే.. తాజాగా ”మీలో ఎవరు కోటీశ్వరులు” షో నుంచి మరో అదిరిపోయే అప్డేట్‌ వచ్చేసింది. ”మీలో ఎవరు కోటీశ్వరులు” షో జెమినీ టీవీలో ఆగస్టు 22 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 గంటలకు ప్రసారం కానుంది ఈ షో. ఈ మేరకు ‘ప్రతి ఇంటికీ వచ్చేస్తున్నా..’ అంటూ సాగే ఎన్టీఆర్‌ స్పెషల్‌ ప్రోమో రిలీజ్‌ చేశారు. ఆగస్ట్‌ 22 న కర్టెన్‌ రైజర్‌, ఆగస్టు 23 నుంచి షో టెలికాస్ట్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news