వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

-

వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను భార్య చితకబాదింది. భార్యను చూసిన భర్త గోడ దూకి పారిపోయినట్లు సమాచారం.

తన తండ్రి మరణిస్తే వచ్చిన డబ్బులు తీసుకుని వ్యాపారం పెడతానని చెప్పి రూ.30 లక్షల నగదు, కారు, స్కూటీ, బంగారాన్ని ఆ మహిళకు తన భర్త ఇచ్చాడని భార్య ఆరోపించింది. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version