ఆంధ్రపదేశ్ లో దారుణం.. మెడికల్ షాపుల్లో నకిలీ మందులు.

-

నకిలీ మందులు ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతున్నాయి. మెడికల్ షాపుల్లో నకిలీ మందుల అమ్మకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ గోదావది జిల్లా భీమవరంలో ఈ నకిలీ మందుల వ్యవహారం బయటకి వచ్చింది. కంపెనీ పేరుతో ఉన్న మందుల్లో అసలు సరైన ప్రమాణాలు లేకుండా, కంపెనీ వాటివే కాకుండా అమ్ముతున్నారని తెలిసింది. నాలుగు రోజుల క్రితం ఒక మెడికల్ షాపులో జరిగిన సంఘటన అందరికీ షాకిచ్చింది. అజిత్రో మైసిన్ మందులను సేకరించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ల్యాబ్ కి పంపారు.

500ఎమ్ జీ ట్యాబ్లెటలో కనీసం పది శాతం కూడా మందు లేనట్లు తెలిసింది. మొత్తం 8బ్యాచుల మందులు ఇదే విధంగా ఉండడంతో అధికారులు అప్రమత్తమై ఇలాంటి మందులు ఎక్కడి నుండి వస్తున్నాయనే విషయం విచారణ సాగిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఇలాంటి షాపులు ఎన్ని ఉన్నాయనే విషయమై చర్యలు వేగవంతం చేస్తామన్నారు. మెడికల్ షాపుల్లో మందులు కొనే ముందు వాటిని డాక్టరుకు చూపించకుండా వాడొద్దని సలహా ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version