కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

-

కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. కారు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

రాయ్​చూర్ జిల్లా లింగసుగుర్ మండలం హట్టి గ్రామానికి చెందిన మహ్మద్​ మఝర్​ హుసేన్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ వచ్చారు. కొడంగల్​ సమీపంలోని ఓ దర్గాను దర్శించుకుని గురువారం రాత్రి స్వస్థలానికి బయలుదేరారు. మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది.

గురమిత్కల్​ మండలం అరెకేరా వద్ద వారి కారును.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. 6 నెలల చిన్నారితో పాటు మొత్తం ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడ్ని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయిన లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version