సౌత్ కొరియాలో కార్చిచ్చు.. 24 మంది అగ్నికి ఆహుతి

-

సౌత్ కొరియా దేశంలో కార్చిచ్చు రగులుకున్నది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందాయి. అగ్ని కిలలు దావానంలా మారి మొత్తం దహించుకుపోతున్నది. దీంతో కార్చిచ్చు మంటల్లో ఇళ్లు, పాఠశాలలు, కర్మాగారాలు, పూజా స్థలాలు కాలి బూడిదవుతున్నాయి.

ఇప్పటివరకు ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 27 వేలకు పైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు సమాచారం. దాదాపు 50 వేల ఎకరాల అడవి ప్రాంతం మంటలకు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మంటలను ఆర్పేందుకు అక్కడి ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. కార్చిచ్చు అడవి మొత్తాన్ని దహించుకువెళ్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రాణనష్టం, ఆస్తి నష్టం మరింత అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news