భార్యను హత్య చేసి సూట్కేసులో కుక్కాడు భర్త. బెంగళూరులోని హుళిమావు సమీపంలో ఈ దారుణ ఘటన జరిగింది. భార్యను చంపి, ముక్కలుగా నరికి ఆపై సూట్కేసులో మృతదేహాన్ని తీసుకెళ్లాడు భర్త రాకేష్. తల్లిదండ్రులను పిలిచి నేరం ఒప్పుకున్నాడు నిందితుడు రాకేష్. మృతురాలు 32 ఏళ్ల గౌరీ అనిల్ సంబేకర్ అని సమాచారం.

ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు దంపతులు. గతేడాది కాలంగా దొడ్డకన్నహళ్లిలో నివాసముంటున్నారు దంపతులు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన డీసీపీ సారా ఫాతిమా… విచారణ చేపట్టారు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. దర్యాప్తు అనంతరం మిగతా వివరాలు వెల్లడిస్తామన్న డీసీపీ… లోతుగా విచారణ చేస్తున్నట్లు ప్రకటించారు.