ఇండిగో తీపికబురు…. కర్నూల్ నుంచి ఫ్లైట్ సర్వీసులు..!

-

ఇండిగో తెలుగు ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పింది. దేశీ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో ఏపీలో కర్నూల్ నుంచి ఫ్లైట్ సర్వీసులు తీసుకొస్తున్నట్టు చెప్పింది. మార్చి నుంచి ఫ్లైట్ సర్వీసులు స్టార్ట్ అవుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ వార్త నిజంగా ఎందరికో ఊరట కలిగించింది. ప్రధాన నగరాలకు వెళ్లాలంటే ఇక నుండి విమానాల మీద వెళ్లొచ్చు. ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.

ఇది ఇలా ఉండగా సర్వీసుల విషయం లోకి వస్తే… కర్నూల్ నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై ప్రాంతాలకు విమాన సర్వీసులు ఇండిగో తీసుకొస్తున్నట్టు చెప్పింది. ఉడాన్ స్కీమ్‌లో భాగంగా ఈ సర్వీసులు మొదలు పెడుతున్నట్టు చెప్పింది. ఇవి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి అనే దానిని చూస్తే… మార్చి 28 నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ మూడు రాజధానుల్లో కర్నూల్ కూడా ఒకటని ఇండిగో చీఫ్ సెక్రటరీ అండ్ రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ అన్నారు.

ఈ సర్వీసులు తీసుకు రావడానికి కారణం.. దక్షిణ భారతదేశంలో కనెక్టివిటీ పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో కర్నూల్ (ఓర్వకల్లు) నోడ్‌గా ఉందని గుర్తు చేశారు. వారంలో నాలుగు సార్లు కర్నూల్ నుంచి బెంగళూరు, కర్నూల్ నుంచి విశాఖపట్నం, కర్నూల్ నుంచి చెన్నైకి విమాన సర్వీసులు ఉంటాయని ఇండిగో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news