ఉదయమే..పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు – రామ చందర్ రావు

-

ఉదయమే..పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామ చందర్ రావు. అక్టోబర్ 27 న బిజెపి కార్యకర్తలు యూసుఫ్ గూడా వద్ద ధర్నా చేస్తుండగా TRS కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని.. ఇందులో 5 బీజేపీ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయని తెలిపారు రామ చందర్ రావు.

మహిళ లను సైతం చూడకుండా కార్యకర్తలపై దాడి చేసారన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టిచుకోలేదని ఫైర్‌ అయ్యారు. కాగా.. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామ చందర్ రావు హౌజ్‌ అరెస్ట్‌ నేపథ్యంలో నేడు బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి పిలుపునిచ్ఛింది బీజేపీ.
ముట్టడికి పిలుపునిచ్చాయి బీజేపీ సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కమిటీలు. దీంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి పిలుపు నేపథ్యంలో భాజపా నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version