అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కన్నీటి పర్యాంతం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతేకాదు ఈ విమాన ప్రమాద ఘటనలో 242 మంది మరణించడం బాధాకరం. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మృతి చెందారు.

అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మరణించినట్టు నిర్ధారించారు అధికారులు. ఇక ఈ విమాన ప్రమాద ఘటనపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ ఘటనకు గల ప్రధాన కారణం పాకిస్తాన్ ఉగ్రవాదులు అని అనుమానాలు వస్తున్నాయి. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.