ఆరోగ్యం పై శ్రద్ధ వహించకపోతే ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా జీవన శైలిలో మార్పులు మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వల్ల దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి. అంతేకాకుండా, దీర్ఘకాలిక వ్యాధుల వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. వాటిలో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఒకటి. ఇది ఒక ప్రాణాంతక వ్యాధి అనే చెప్పవచ్చు. దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూ వస్తోంది. బ్రెయిన్ ట్యూమర్ సమస్యకు సంబంధించిన కేసులు క్రమంగా పెరగడం వలన అందరూ ఆందోళన చెందుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ సమస్య అంటే మెదడులో కణితి ఏర్పడడం మరియు అకస్మాత్తుగా ఈ సమస్య పెద్దది అవుతుంది.
దీంతో ఆరోగ్యం పై చాలా ప్రమాదం ఉంటుంది. అయితే, బ్రెయిన్ ట్యూమర్ ను ముందుగా పసిగట్టడం వలన సరైన ట్రీట్మెంట్ ను ముందుగానే తీసుకోవచ్చు. ఈ సమస్యకు సంబంధించిన లక్షణాలు రాత్రి సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎప్పుడైతే బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడతారో, నిద్రలేమి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ ట్యూమర్ను ఎదుర్కొనేవారు పగటిపూట కూడా ఎక్కువ నిద్ర మరియు నీరసంగా కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా, నిద్రకు భంగం కలగడం మరియు అలసటగా ఉండడం వంటివి ఎదుర్కొంటారు.
ఎప్పుడైతే బ్రెయిన్ ట్యూమర్తో బాధపడతారో, తలనొప్పి ఎంతో తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, తలనొప్పి మరింత పెరుగుతుంది. ఈ విధంగా కొనసాగడం వలన మెదడులో కణితి వలన ఒత్తిడి మరింత పెరుగుతుంది అనే చెప్పవచ్చు. ఎప్పుడైతే బ్రెయిన్ ట్యూమర్ ను ఎదుర్కొంటారో, నిద్ర పోయిన సమయంలో లేక నిద్ర లేచిన వెంటనే వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్రెయిన్ ట్యూమర్ను ఎదుర్కొన్నప్పుడు చెమటలు పట్టడం, విశ్రాంతి లేకుండా ఉండడం వంటివి ఎదురవుతాయి. ముఖ్యంగా రాత్రి పడుకున్న తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. దీని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు. కనుక తప్పకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.