అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కన్నీటి పర్యాంతం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటివరకు విమాన ప్రమాద ఘటనలో 110 మంది మరణించడం బాధాకరం.

కానీ ప్రమాద తీవ్రత అధికంగా జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే ఇందులో ప్రయాణించిన ప్రయాణికులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 మంది మెడికోలు మృతిచెందినట్లు సమాచారం. ఈ విమాన ప్రమాద ఘటనపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ ఘటనకు గల ప్రధాన కారణం పాకిస్తాన్ ఉగ్రవాదులు అని అనుమానాలు వస్తున్నాయి. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.