ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం..20 మంది మెడికోలు మృతి !

-

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కన్నీటి పర్యాంతం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటివరకు విమాన ప్రమాద ఘటనలో 110 మంది మరణించడం బాధాకరం.

Air India Plane Crash 20 Students Feared Dead at BJ Medical College and Civil Hospital in Ahmedabad
Air India Plane Crash 20 Students Feared Dead at BJ Medical College and Civil Hospital in Ahmedabad

కానీ ప్రమాద తీవ్రత అధికంగా జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే ఇందులో ప్రయాణించిన ప్రయాణికులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 మంది మెడికోలు మృతిచెందినట్లు సమాచారం.  ఈ విమాన ప్రమాద ఘటనపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ ఘటనకు గల ప్రధాన కారణం పాకిస్తాన్ ఉగ్రవాదులు అని అనుమానాలు వస్తున్నాయి. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news