మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి పేరు ఒక్కసారిగా మోరుమోగుతోంది. ఆమె విమానంలో సీపీఆర్ చేసి ప్రాణాలు ఓ ప్రాణాన్ని కాపాడటమే ఇందుకు కారణం. శనివారం అర్థరాత్రి ఇండిగో విమానంలో ఆమె ప్రయాణిస్తున్న సమయంలో మూర్చపోయి, నోట్లో నుండి ద్రవం కారుతూ 74 ఏళ్ల వృద్ధుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
బీపీ తక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చి వెంటనే సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలను డాక్టర్ ప్రీతి రెడ్డి కాపాడారు.విమానం ల్యాండ్ అయిన వెంటనే వృద్ధుడిని ఆసుపత్రికి తరలించి ఎయిర్ పోర్ట్ సిబ్బంది చికిత్స అందించగా సదరు వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడిన ప్రీతిరెడ్డి పేరు ప్రస్తుతం మోరు మోగుతోంది.