బాసరలో గోదావరిలో మునిగి 4 గురు హైదరాబాద్ వాసులు మృతి

-

బాసరలో విషాదం చోటు చేసుకుంది. బాసరలో గోదావరిలో మునిగి నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరిలో స్నానానికి దిగి నలుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు మృతదేహాలను గుర్తించగా.. గల్లంతైన మరొకరి ఆచూకీ కోసం గాలుస్తున్నారు. ఇక అటు పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు… జరిగిన సంఘటన గురించి చెప్పారు.

Four Hyderabadis drown in Godavari in Basara
Four Hyderabadis drown in Godavari in Basara

ఈ తరుణంలోనే హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. మృతులంతా హైదరాబాద్‌లోని దిల్‍సుఖ్‍నగర్ వాసులుగా గుర్తించారు పోలీసులు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా నిర్ధారించిన పోలీసులు… విచారణ చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news