భర్తకు బలవంతంగా మద్యం తాగించి రాడ్డుతో కొట్టి చంపింది భార్య. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ –20 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుండి బ్రతుకుదెరువు కోసం వచ్చి, పూల వ్యాపారిగా స్థిరపడి, సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో భార్యతో కలిసి నివాసముంటున్నారు జీషన్ అలీ (45) అనే వ్యక్తి.

భర్త రోజూ మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్య.
పోలీసులు మందలించినా మారకపోవడంతో, బలవంతంగా మద్యం తాగించి ఇనుప రాడ్డుతో భర్త తలపై దాడి చేసింది భార్య. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు భర్త జీషన్ అలీ. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.