స్థానిక ఎన్నికలు… నిమ్మగడ్డకు నాలుగే నాలుగు ప్రశ్నలు!!

-

తాను మైకందుకున్న ప్రతిసారీ తనది రాజ్యాంగపద్ద పదవి అని చెప్పుకునే నిమ్మగడ్డ రమేష్ కుమార్… ఒక పవిత్రమైన రాజ్యాంగ కర్తవ్యంగా భావించాల్సిన ఎన్నికల నిర్వహణను.. ఒక డ్రామాగా భావిస్తున్నారు అనేది వైకాపా నేతల వాదనతో పాటు ఒక వర్గం ప్రజల వాదన! ఈ సమయంలో నిమ్మగడ్డపై నాలుగు ప్రశ్నలు సంధిస్తున్నారు వైకాపా నేతలు!

* నేడు ఆల్ పార్టీ మీటింగ్ కి అన్ని పార్టీలను పిలిచి మీటింగ్ పెడుతున్న నిమ్మగడ్డ… రాష్ట్రంలో 3 కోవిడ్‌ కేసులు కూడా లేని రోజుల్లో ఏ రాజకీయ పార్టీలను అడిగి ఎన్నికలను వాయిదా వేశారు?

* ఇప్పుడు దాదాపు రోజుకు 3 వేల కేసులు నమోదవుతున్న సమయంలో, ఒకసారి కోవిడ్‌ సోకిన వారికి రెండోసారి సోకుతున్న నేపథ్యంలో ఏ ఉద్దేశ్యంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు?

* ఎన్నికల నిర్వహణ విషయంలో.. ఓటువేసే ఓటరు భద్రతను అంటే 3 కోట్ల ప్రజల భద్రతనుంచి.. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే టీచర్లు, ఇతర ఉద్యోగ సోదర, సోదరీమణులు, పోలీసుల వరకూ ప్రతి ఒక్కరి భద్రతకు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ బాధ్యత వహిస్తారా?

* స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల మీద ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయా లేదా అనే అంశంపైనా.. ఆ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీతో, మొత్తంగా ప్రభుత్వంతో చర్చించి వారి అభిప్రాయం ప్రకారం ముందుకెళ్లాలి కానీ… రాష్ట్రంలో ఉనికే లేని, పోటీలో లేని, ఒక్క ఓటు కూడా లేని రాజకీయ పార్టీలను పిలిపించి చర్చించామని చెప్పుకోవడాన్ని ఏమని భావించాలి?

ఈ నాలుగు ప్రశ్నలు వైకాపా నేతల నుంచే కాకుండా సామాన్యుల నుంచి కూడా వ్యక్తమవుతున్న తరుణంలో… ఈ ప్రశ్నలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ఎన్నికల అధికారిగా, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా సమాధానం చెప్పగలుగుతారా? చెప్పకుండానే ముందుకు వెళ్తారా? ఇది ప్రజాస్వామ్యం అని మరుస్తారా? వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Exit mobile version