ఏపీలో మరో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..

-

ఆంధ్ర ప్రదేశ్ వరుస అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం, పోలీసు శాఖ చర్యలు చేపడుతున్నా.. మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మరో దారుణ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడు నెలల క్రితం ఆమె ఓ బాబుకు జన్మనించింది. పది రోజుల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. నిన్న ఉదయం బాబును తోడికోడలకు అప్పగించి బహిర్భూమికి వెళ్లింది. అప్పటికే అక్కడ కాపుకాసిన నిందితులు ఆమెపై అత్యాచారం చేసి ఆపై బండరాయితో మోది హత్యకు పాల్పడ్డారు.

బహిర్భూమికి వెళ్లిన ఆమె 10 గంటలు అవుతున్నా తిరిగి రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు గాలించగా ఊరిబయట విగతజీవిగా ఆమె కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ముఖం పూర్తిగా ఛిద్రమై ఉండడాన్ని గుర్తించారు పోలీసులు. సమీపంలోని బావి వద్ద ఉన్న బండరాళ్లను తెచ్చి ఆమెను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ముందస్తు పథకంలో భాగంగానే గ్రామానికి చెందిన కొందరు ఆమెను ఊరి బయటకు పిలిపించి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. బంధువుల్లోనే కొందరిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. హత్యకు ముందు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version