గంటా శ్రీనివాస్ రావు: ఉత్తరాంధ్రలో నాలుగు సీట్లైనా వస్తాయా..?

-

రాష్ట్రంలోని అన్ని వర్గాలు కూడా కోపంగా ఉక్రోషంగా ఉన్నాయి అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసిపి ప్రభుత్వాన్ని 100 అడుగులు లోతులో పాతి పెట్టడం ఖాయం అని అన్నారు శ్రీలంకలో ఆ ప్రభుత్వాన్ని తరిమికొట్టినట్లే జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని చెప్పారు గంటా శ్రీనివాసరావు. జగన్ మోహన్ రెడ్డికి మిగిలింది దింపుడు కళ్ళెం. భ్రమలు విడిచి పెడితే మంచిదని గంట శ్రీనివాసరావు చెప్పారు.

మూడు రాజధానులు పేరు చెప్పి విశాఖలో 300 కోట్లతో విలాసమైనా భవనాన్ని కట్టారని అది తప్ప చిన్నపాటి అభివృద్ధి కూడా లేదని అన్నారు గంట శ్రీనివాసరావు. జనసేన టిడిపి ప్రభుత్వం రావడం చారిత్రిక అవసరమని చెప్పారు ఉత్తరాంధ్రలో నాలుగు సీట్లు అయినా గెలవగలరని చెప్పగలరా అని ప్రశ్నించారు గంటా శ్రీనివాసరావు. రాజ్యాంగం విధానాల్ని పాటించకుండా నా రాజీనామా అని ఆమోదించినందుకే న్యాయ పోరాటం చేస్తున్నానని గంట శ్రీనివాసరావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news