ఓ వ్యక్తి ప్రైవేటు భాగాల్లో ఎయిర్ కంప్రెషర్‌ పెట్టి స్నేహితులు దారుణం…!

-

యూపీలోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు.. తమ మిత్రుని ప్రైవేటు భాగాల్లో ఏకంగా ఎయిర్‌ కంప్రెషర్‌ పెట్టి…తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో బాధితుడి కార్యాలయంలో జరిగింది. దీంతో ఆ ఇద్దరు నిందులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అసలు వివరాల్లోకి వెళితే.. సందీప్‌ కుమార్‌, అంకిత్‌, మరియు గౌతమ్‌లు మంచి స్నేహితులు. సందీప్‌ కుమార్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే… ఈ ముగ్గురు మిత్రులు ఎప్పుడు సరదాగా ఉండే వారు. అయితే..గత మంగళవారం రోజున వారు అంకిత్, గౌతమ్‌లు ఎయిర్‌ కంప్రెషర్‌తో ప్రయోగం చేయాలని ఆలోచన చేశారు.

అయితే.. ఈ ప్రయోగం తన మిత్రుడు సందీప్‌ కుమార్‌ ప్రైవేటు భాగాలపై చేయాలను నిర్ణయం తీసుకున్నారు. దీనికి సందీప్‌ కుమార్‌ ససేమిరా అన్నప్పటికీ.. అంకిత్, గౌతమ్‌లు ఒత్తిడి చేసారు. సందీప్‌ కుమార్‌ ప్రైవేటు భాగాల్లో ఆ ఎయిర్‌ కంప్రెషర్‌ పెట్టి.. ఒత్తిడిని పెంచారు. దీంతో సందీప్‌ కుమార్‌ కడుపు ఉబ్బిపోయి.. చిన్న పేగులు మరియు పురుషనాళం యొక్క భాగాలు పేలిపోయాయి. దీంతో తీవ్ర రక్తం స్రావం అయింది. ఈ సంఘటన తరువాత, సందీప్‌ కుమార్‌ను వెంటనే స్థానిక త్రిపాఠి ఆసుపత్రికి తరలించారు. అయితే.. కుమార్‌ పరిస్థితి విషమించడంతో మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సందీప్‌ కుమార్‌ పరిస్థితి చాలా క్రిటికల్‌ గా ఉంది. అతడు కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టవచ్చని వైద్యులు పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ఇద్దరు నిందుతులు పోలీసుల అదుపులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news