బ్రేకింగ్‌: క్షీణించిన బంగారం ధ‌ర‌.. షాక్ ఇచ్చిన వెండి

-

రెండు రోజులుగా పెరుగుతూ వ‌స్తోన్న బంగారం ధ‌ర ఈ రోజు త‌గ్గుద‌ల న‌మోదు చేసింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాములకు కేవలం రూ.10 క్షీణించింది. దీంతో ధర రూ.38,990 నుంచి రూ.38,980కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,530 వద్దనే కొనసాగుతోంది. బంగారం ధర దాదాపు స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.49,300కు చేరింది.

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.290 ఎగసింది. దీంతో ధర రూ.41,000కు చేరింది. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.290 పెరుగుదలతో రూ.39,800కు ఎగసింది. ఇక్క‌డ బంగారం ధ‌ర పెరిగితే వెండి కూడా అదే బాట‌లో న‌డిచింది. కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.49,300కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version